సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలో కొలువైన శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు దంపతులు శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,ఆలయ అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ,ధనుంజయ శర్మ శ్రీ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి నాగేశ్వరరావు,నరసింహారావు,సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్