గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. కల్వకుర్తి మండల పరిధిలోని జీడిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లు ఎంపీ రాములు పరిశీలించి, స్థానికులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల సర్వతోముఖ అభివృద్ధికి ప్రతి నెల రూ. 339 కోట్ల గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ రాములు తెలిపారు. ఎంపీ వెంట స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.