నిజామాబాద్ జిల్లా లో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. రుద్రుర్ మండల సిద్ధపూర్ గ్రామంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఆయన భూమిపూజ,శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న SC కమ్యూనిటీహాల్ కోసం భూమిపూజ చేశారు. సొంత స్థలాల పైన నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సిద్ధపూర్ క్యాంప్ లో నూతనంగా నిర్మించిన C C రోడ్డు, నూతనంగా నిర్మించిన డ్రైనేజ్ కాలువలు, పాఠశాల అదనపు గది భవనాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ భవనానికి, శ్రీ ఆంజనేస్వామి స్వామి ఆలయం ప్రహరీ గోడ కు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమం లో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం