అధికార వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూ ఆక్రమణపై మత్స్యకారులు తిరుగుబాటు చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాకినాడ కుంబాబిషేకం వద్ద మత్స్యకారుల స్థలాన్ని వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దురఆక్రమణ చేశారు. దీన్ని నిరసిస్తూ మత్స్యకారులు ఆందోళన చేశారు.
ఎమ్మెల్యే ఆక్రమించి స్థలాల్లో ఏర్పాటు చేసుకున్న కంచెను, బోర్డులను మత్స్యకారులు తెలిగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్ ఎల్ ఏ..కొండబాబు మత్స్యకారులకు మద్దత్తు తెలిపారు.