గ్రామ పంచాయతీ కార్మికులకు పిఆర్సి అమలు చేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి కి గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ వినతి పత్రం సమర్పించింది. మండల ప్రధాన కార్యదర్శి జిలకర కురుమయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల మీద రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ మండల ఉపాధ్యక్షులు E బాలస్వామి, ఆనంద్, జిపి కార్మికులు రాఘవేందర్, బుడ్డయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్