తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నవంబర్ 30వ తేదీన ప్రజలు ఎవరికి పట్టంకట్టబోతున్నారు, డిసెంబర్ 3వ తేదీన ఎవరికి మెజారిటీ సీట్లు రాబోతున్నాయని ఎన్నికలకు ముందే ఉమ్మడి మహబూబ్ నగర్ జర్నలిస్ట్ అవుట రాజశేఖర్ ప్రత్యేక విశ్లేషణాత్మక కథనాలు ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారని విశ్లేషించారు. అదే నిజమైనది. అల్లంపూర్ అక్కడ వ్యక్తిగత కారణాలతో పార్టీ ఓడిపోతున్నారని ముందే విశ్లేషించారు.
ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలలో అలంపూర్ మినహా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లు చెప్పారు. మొత్తానికి 12 సీట్లు గెలిచింది. అదేవిధంగా గద్వాలో సింహం గుర్తు అభ్యర్థి వల్లనే కాంగ్రెస్ ఓటమి చూశారని చెబుతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అతి సల్ప మెజార్టీతో గెలిచినప్పటికీ సరితమ్మ నైతిక విజయం గెలిచారని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా కొల్లాపూర్, మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏంత వరకు మెజార్టీ వస్తుందో కూడా విశ్లేషించారు. అదే నిజమైంది..
గత 2018లో కొల్లాపూర్ నియోజక వర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నానేది కూడా ముందే విశ్లేషించారు. అదే ఫలితాలు వచ్చాయి. 2023 లో విశ్లేషించిన విధంగానే ఫలితాలు వచ్చాయి.2021 ఇలాంటి కథనాలపై ప్రత్యేక అంశాలను వాస్తవాలను కొల్లాపూర్ నియోజకవర్గంలో వెలుగులోకి తెచ్చినందుకు, జరగబోయే పరిణామాలపై విశ్లేషించినందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజున 2021లో అక్రమ కేసులతో పోలీస్ స్టేషన్ లోనే అత్యాయత్నానికి గురయ్యాడు. తొమ్మిది రోజులు జైలు జీవితం గడిపాడు.