అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దాదాపుగా 3లక్షల విలువగల కర్ణాటక మద్యం దొరికింది. మద్యం తో పాటు ఒక కారు 5 గురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా కర్ణాటక పగోడా వద్ద నుండి మద్యం తెస్తూ ధర్మవరంలో ఎక్కువ లాభాలకు అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఈరోజు మధ్యాహ్నం 3గంటల సమయం లో యరగుంట వైస్సార్ సర్కిల్ వద్ద వెహికల్ చెకింగ్ చేశారు.
పరమేష్ రెడ్డి అనే వ్యక్తి కారులో 21కేసులు కర్ణాటక మద్యం దొరికినది. విచారించగా అతని ఇంటి దగ్గర ఉన్న దాదాపు 32 కేసుల్ని చూపించాడు. ఇతను దాదాపు గత 4నెలల నుండి మద్యం వ్యాపారం చేసేవాడిని అతను పేర్కొన్నాడు. అతనితో పాటు మరో నలుగురికి పరమేష్ రెడ్డి సప్లై చేసే వాడని ఒప్పుకున్నాడు.