37.2 C
Hyderabad
May 1, 2024 13: 28 PM
Slider అనంతపురం

పట్టపగలే డ్రైవర్ దారుణ హత్య

#kadiri

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో పట్టపగలే డ్రైవర్ వంశీ దారుణ హత్యకు గురయ్యారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుల ఆటో స్టాండ్ వద్ద సైదాపురం కు చెందిన జల్లా శ్రీనివాసులు, ప్రభావతమ్మ పెద్ద కుమారుడు వంశీని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడవగా ఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతుడి భార్య రోధించిన తీరు పలువురుకు కంటతడి పెట్టించింది. మృతునికి భార్యతోపాటు ఏడాది పసిపాప ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

సత్యంన్యూస్.నెట్ సత్యసాయి జిల్లా

Related posts

జాతీయ సమగ్రతను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి

Satyam NEWS

26 వరకూ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Satyam NEWS

ఈ నెల 20 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Murali Krishna

Leave a Comment