ఉత్తర ఒడిసా మీదుగా తుపాను ఆవర్తనం నెలకొంది. ఉత్తర పంజాబు నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఇది దక్షిణాదికి మరలే అవకాశం ఉన్నందున తేమతో కూడిన తూర్పు గాలులు బంగాళాఖాతం మీద నుంచి ఉత్తరాదికి వ్యాపిస్తాయి.
వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 26 వరకూ వర్షాలు పెరుగుతూ ఉంటాయి. నేటి నుంచి రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో చెదురు మదురు జల్లులు పడతాయి. 25, 26 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.