ఈ నెల జూలై 1న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఐడియా పోటీలో సీబీఐటీకి విద్యార్థిని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో రెండవ సంవత్సరం చదువుతున్న స్వరాలి శర్మ కి ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా సిబిఐటి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వెంకట నర్సింహులు, కుమారి స్వరాలి ని అభినందిచారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వరాలికి 10,000 రూపాయల నగదు బహుమతి మరియు ఇంక్యుబేషన్ స్థాపించుటకు 1 లక్ష రూపాయల సపోర్ట్ లభించింది అని తెలిపారు. ఈ పోటీలను ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేటర్ మరియు ఫైండ్హోప్ సంయుక్తంగా నిర్వహించారు. ఇతర కళాశాల విద్యార్థులు శ్రీ సాయి మహిత్ వాసంశెట్టి, మణిచేగు, జువేరియా అబ్దుల్ రహీం మహమ్మద్ విద్యార్థులు టాప్ 10 విజేతలలో జాబితాలో వున్నారు అని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సిబిఐట్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, సిఎస్ఇ హెడ్ ప్రొఫెసర్ ఎం స్వామి దాస్ మరియు ఇతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు.
previous post
next post