విజయనగరం ఎమ్మెల్యే,జేడ్పీ చైర్మన్ పై టీడీపీ నగర శాఖ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. జిల్లా కేంద్రంలో అందులో ప్రధానంగా జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న చెరువులను, స్థలాలను దర్జాగా ఆక్రమించుకున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు చెరువులను కాపాడాలంటూ కలెక్టర్ ఆడిటోరియంలో జరుగుతున్న గ్రీవెన్ సెల్ లో డీఆర్ఓ గణపతిరావుకువినతి పత్రం ఇచ్చారు.
అనంతరం…బయట మీడియాతో కనకల, కర్రోతు, ప్రసాదుల వంటి టీడీపీ నేతలు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే,జేడ్పీ చైర్మన్ లు దర్జాగా చెరువులను కబ్జా చేసారని ఆరోపించారు. విజయనగరం రింగురోడ్డు నుండి జమ్మునారాయణ పురం వెళ్లే దారిలో రోడ్డుకు ఆనుకుని ఉన్న మహారాణి పేట సౌత్ వార్డుకు సంబందించిన టీఎస్ నెం. 569 లో ఉన్న చెరువు స్థలాన్ని అధికార పార్టీ కార్యాలయానికి కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ పేర్కొంది.అతి పురాతనమైన, చరిత్ర పుటల కెక్కిన విజయనగరాన్ని అధికార వైఎస్ఆర్సీపీ అడ్డగోలుగా ఆక్రమించుకుని…చారిత్రక స్థలాలు..చెరువులను దర్జాగా…పార్టీ ఆఫీసుల పేరుతో ఆక్రమించుకుంటున్నారని..దీనిపై తగు చర్యలు తీసుకోవాలని…గ్రీవెన్స్ సెల్ లో వినతి పత్రం ఇచ్చామని తెలిపారు.