29.7 C
Hyderabad
May 2, 2024 06: 16 AM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా  అయ్యప్ప మహా పడిపూజ

#puja

రామంతపూర్ డివిజన్  శ్రీనగర్ కాలనీలో హనుమాన్ టెంపుల్ లోఅయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారు లక్ష్మారెడ్డి  హాజరయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వాముల దీక్షకాలం ముగిసే రోజులలో దీక్ష విరమణకు శబరిమలై వెళ్లే ముందు ఇరుముడి కార్యక్రమమును నిర్వహిస్తారు. ఇది గురుస్వాముల సమక్షంలో వారి సూచనల, పూజల తతంగంతో ముగుసిన తరువాత, అయ్యప్ప స్వాములు దీక్ష విరమణకు శబరిమల యాత్రకు బయలుదేరుతారు. ఇరుముడి కార్యక్రమం అనంతరం బండారి లక్ష్మారెడ్డి  అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర క్షేమంగా ముగియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు నాగ శేఖర్, యాకాంత రాము, శివ, హరీష్ మరియు బి ఆర్ ఎస్ నాయకులు నరేష్, జహంగీర్, సూరం శంకర్, అరవింద్, రాజు యాదవ్, బోసాని పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

మూడు చిత్రాలను ప్రకటించిన వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

Satyam NEWS

దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

Bhavani

ఇయర్ ఎండింగ్: వరుసగా పోలీస్ బాస్ పోలీస్ స్టేషన్ల తనిఖీ

Satyam NEWS

Leave a Comment