రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లనూ ఆయా జిల్లాల పోలీస్ బాస్ లు వార్షిక తనిఖీల్లో భాగంగా విజిట్ చేస్తున్నారు. అందులో భాగంగా విజయనగరంలో జిల్లా పోలీస్ బాస్, రెండో కూడా తనిఖీలు చేసారు. నిన్న వన్ టౌన్ పీఎస్ ను తనిఖీ చేయగా తాజాగా టూటౌన్ పీఎస్ ను ఎస్పీ దీపిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక విజయనగరం టూటౌన్ పీఎస్ ను సందర్శించి, స్టేషను ప్రాంగణం, కేసు ప్రాపర్టీ గది, రిసెప్షన్ పరిశీలించారు. స్టేషను రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేసి, సంతృప్తిని వ్యక్తం చేశారు.
అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో మమేకమై, వారి ఉద్యోగపరమైన, వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దత్తత ఇచ్చిన వార్డుల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి, బైండోవర్ చేయాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ కేసులు, ఎక్సైజ్, గంజాయి కేసులు నమోదు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలు గుర్తించి, చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు.ఈ తనిఖీల్లో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు,టూటౌన్ సి ఐ ఎన్.హెచ్.వి. విజయ ఆనంద్, ఎసైలు షేక్ శంకర్, రాజేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.