నిన్న పోలీసులు అరెస్టు చేసిన టీడీపి నాయకుడు నారాయణకు బెయిల్ మంజూరు అయింది. చిత్తూరు జిల్లా పోలీసుల రిమాండ్ అభ్యర్ధన ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి, నారాయణ న్యాయవాదుల వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారు. 2014 లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు న్యాయవాదులు ఆధారాలు చూపించారు. దాంతో మెజిస్ట్రేట్ సులోచనారాణి నారాయణకు వ్యక్తిగత పూచీకత్తు తో బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు తో పాటు రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు.
previous post
next post