మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పై దాడిని ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
పోలీసుల సమక్షం లో తమవాళ్ళ పై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
రాత్రంతా టీఆరెస్ డబ్బులు పంచినా మేధావులు లొంగ లేదని తెలుసుకుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇవాళ కూడా ఓటుకు రూ. 10 వేలు పంచుతుంటే మావాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారని బండి సంజయ్ అన్నారు.
అందుకే ఓటమి భయం తో మా వాళ్లపై TRS దాడులకు దిగుతోందని ఆరోపించారు. తాము ప్రతిదాడులకు దిగితే టీఆరెస్ ఎదుర్కొన లేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలన్నారు.
తమ పార్టీ వాళ్ళు తిరగబడితే జరగబోయే పరిస్థితులకు టీఆరెస్ దే బాధ్యత అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.