విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో టీడీపీ బోణీ కొట్టింది. కడపటి సమాచారం మేరకు 50 వార్డు లకు గాను 25 వార్డులలో అధికార వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా..29 వ డివిజన్ గాజులరేగ లో టీడీపీ అభ్యర్ధిని కర్రోతు రాధిక గెలుపు బావుటా ఎగుర వేసారు.
ఇంతవరకు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు గెలుపు జాబితా లో అత్యధిక స్థానాలను అధికా వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న సమయంలో 29 వ డివిజన్ అభ్యర్థి గా టీడీపీ బలపరిచిన కర్రోతు రాధికా గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడారు.