వనపర్తి పట్టణంలోని రాయగడ్డలో మనుసాని శ్రీనివాసులు దగ్గర గుట్కా పాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని వనపర్తి టౌన్ ఎస్.ఐ. వెంకటేష్ గౌడ్ విలేకరులకు తెలిపారు. అప్పాయిపల్లి ప్రస్తుతం రాయగడ్డ వనపర్తి లో ఉంటున్నాడని చెప్పారు.
నమ్మదగిన సమాచారం మేరకు వనపర్తి పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు గౌడ్, ట్రైనీ ఎస్.ఐ మమతా రెడ్డి, కానిస్టేబుల్ నవీన్ కుమార్ గౌడ్, హోంగార్డ్ సహదేవుడు, రాజ్ కుమార్ కలిసి రాయగడ లో గల శ్రీనివాసులు ఇంటి కాంపౌండ్ ఆవరణంలో గుట్కా ప్యాకెట్ల రెండు సంచులు పట్టుకున్నారు. వీటిలో 1.సాగర్ పాన్ మసాలా 52 ప్యాకెట్లు వీటి విలువ 3900, 2.ఎస్ ఆర్ ప్యాకెట్లు 52 వీటి విలువ 3640 రూపాయలు 3.ఆర్ఆర్ టుబాకో 21 ప్యాకెట్లు వీటి విలువ 3845 రూపాయలు మీరజ్ నలభై ఐదు ప్యాకెట్లు వీటి విలువ 7425 రూపాయలు 4.విమల్ 52 ప్యాకెట్లు వీటి విలువ 6292 రూపాయలు వీటి మొత్తం విలువ 25142 రూపాయలు ఉందని ఎస్.ఐ. చెప్పారు.
ప్రభుత్వం నిషేధించబడిన గుట్కాలను సీజ్ చేశామని చెప్పారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి