సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ములుకు జిల్లా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హైస్కూల్ లో నేడు పోషన్ అభియాన్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా DWO ప్రేమలత హాజరు అయ్యారు. CDPO లక్ష్మీ, ప్రిన్సిపాల్, BRB కోర్డినేటర్ స్వాతి , చైల్డ్ లైన్ సిబ్బంది , పోషన్ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హైస్కూల్ లోని బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత పై కూడా అవగాహన కల్పించారు.
అలాగే వ్యాసరచన, డ్రాయింగ్, సమతుల ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత మీద పోస్టర్ తయారీ వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు.