కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సిఐ చామంతుల టాటా బాబు ఏసిబికి చిక్కాడు. తన సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్రూల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక భూ వివాదంలో నమోదైన కేసులోని కాంట్రాక్టర్ కు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ అవినితి నిరోధక శాఖ కు ఆయన దొరికాడు.
ఈ సంఘటన సోమవారం సాయంత్రం బాన్సువాడ పట్టణంలోని బాన్సువాడ రూరల్ సిఐ సిహెచ్ టాటా బాబు నివాసంలో జరిగింది.
నస్రూల్లా బాద్ మండలం ఆంకోల్ తాండాకు చెందిన ప్రతాప్ సింగ్ నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా టాటాబాబును ఎసిబి అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు.
ప్రతాప్ సింగ్ పై ఆగస్టు 20 న బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దానితో అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వాడానికి టాటా బాబు రూ.50 వేలు డిమాండ్ చేశారు.
కాని చివరకు రూ.20 వేల కు అంగీకరించాడు. బాధితుడు ఈ విషయంను ఎసిబి అధికారులకు సమాచారం అందిచాడు. వారి సూచన మేరకు తొలి ధపాలో రూ.10 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.
ఈ మేరకు బాన్సువాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో, టాటా బాబు నివాసంలో ఎసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు.