38.2 C
Hyderabad
April 29, 2024 21: 40 PM
Slider గుంటూరు

ఛీటింగ్: బాపట్ల ఎంపి సురేష్ పేరుతో భూ దందా

nandigam suresh

బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఎంపీ స్టిక్కర్ తో స్కార్పియో వాహనంలో భూ దందాలు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. స్కార్పియో వాహనానికి ఎంపీ స్టిక్కర్ తో నేమ్ బోర్డ్ తో మంగళగిరిలో వారు దందాలకు పాల్పడుతున్నారు.

ఎంపీ నందిగామ సురేష్ పేరుతో గత 15 రోజులుగా వారు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ల్యాండ్ విషయంలో ఎంపీ సురేష్ పేరుతో మరో దందా కూడా వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న ఎంపీ సురేష్ స్వయంగా మంగళగిరి వచ్చి యువకులను మందలించి వాహనానికి ఉన్న స్టిక్కర్ ను నేమ్ ప్లేట్ ను తొలగించారు. గత నెల రోజులుగా తాము చేసిన దందాలకు ఎంపీ సురేష్ కి ఎటువంటి సంబంధం లేదని మంగళగిరి స్టేషన్లో యువకులు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు.

Related posts

రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై పటిష్టమైన నిఘా

Satyam NEWS

ఉప్పల్ నియోజకవర్గ TUWJ నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

కరోనాతో మాజీ క్రికెటర్‌ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

Satyam NEWS

Leave a Comment