25.7 C
Hyderabad
May 24, 2025 09: 09 AM
Slider జాతీయం

కరోనాతో మాజీ క్రికెటర్‌ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

#Chetan Chowhan

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, ఉత్తర ప్రదేశ్ మంత్రి చేతన్‌ చౌహాన్ (73)‌ కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ మేరకు చేతన్‌ చౌహాన్‌ మృతి చెందినట్లు అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు.

జులై 12న కరోనా వైరస్‌ బారిన పడడంతో ఆయనను మొదట లఖ్‌నౌవూలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండడంతో గురుగావ్ లోని మరో ఆసుపత్రికి తరలించారు.

ఆయన కిడ్నీతో సహా కొన్ని అవయవాలు పాడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో చేతన్‌ చౌహాన్‌ ఇవాళ తుది శ్వాస విడిచారు. 

తన కెరీర్‌లో భారత్‌ తరఫున చేతన్‌ చౌహాన్‌ 40 టెస్టులు, ఏడు వన్డేలు ఆడారు. చేతన్ చౌహాన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

తెలంగాణాకు నిధుల విడుదలలో చిన్న చూపు

mamatha

చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి మనుషుల రాళ్ల దాడి

Satyam NEWS

మిస్టరీ: తిరుమల లో ఉద్యోగి ఆత్మహత్య కు కారణమేంటి?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!