టీమ్ఇండియా మాజీ ఓపెనర్, ఉత్తర ప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ (73) కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ మేరకు చేతన్ చౌహాన్ మృతి చెందినట్లు అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు.
జులై 12న కరోనా వైరస్ బారిన పడడంతో ఆయనను మొదట లఖ్నౌవూలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండడంతో గురుగావ్ లోని మరో ఆసుపత్రికి తరలించారు.
ఆయన కిడ్నీతో సహా కొన్ని అవయవాలు పాడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతణ్ని వెంటిలేటర్పై ఉంచారు. ఈ క్రమంలో చేతన్ చౌహాన్ ఇవాళ తుది శ్వాస విడిచారు.
తన కెరీర్లో భారత్ తరఫున చేతన్ చౌహాన్ 40 టెస్టులు, ఏడు వన్డేలు ఆడారు. చేతన్ చౌహాన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.