హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీలో స్థానిక సమస్య లపై కార్పోరేటర్ వెంకటేష్ గౌడ్ స్థానిక సమస్య లపై బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు.
కాలనీలో కొంత భాగం ఎత్తుగా ఉండటంతో తాగునీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని, కాలనీలో పోల్స్ అవసరం ఉందని, స్మశానవాటిక కు ధారి నిర్మాణం అవసరం ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ పోల్ ను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని, వీలైనంత తొందరగా తాగునీటి, డ్రైనేజీ విస్తరణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో యువ నాయకులు రామక్రిష్ణ గౌడ్, సీనియర్ నాయకులు బోయ కిషన్, వార్డు సబ్యులు కాశీనాథ్ యాదవ్, నాయకులు వాసు, రవిందర్,ధన లక్ష్మీ, జీ. లక్ష్మీ, ఎల్లమ్మ, భవాని, మధు తదితరులున్నారు.