హైదరాబాద్ లోని మూసాపేట్ జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ లో జోనల్ కమిషనర్ మమత ఆధ్వర్యంలో నేడు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబు రావు, వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఈ సంబురాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు డివిజన్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బతుకమ్మ పండుగను మహిళలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఓ సుజాత ఆర్ పి లు కవిత సరిత, రాధాభాయ్, విజయ తదితరులు పాల్గొన్నారు.
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక హోమం
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని శరన్నవరాత్రులు సందర్భంగా సుమిత్ర నగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం రామకృష్ణ స్ట్రీట్ పెద్దమ్మ టెంపుల్ లో అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కోవిడ్ నుండి ప్రజలకు విముక్తి అయ్యేలా, జీవన విధానం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా అమ్మ వారి కృప ఉండాలని కోరారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించమని అన్నారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, హరినాథ్, పురేందర్ రెడ్డి, వేణు, అరుణ్, చారి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.