30.7 C
Hyderabad
April 29, 2024 03: 16 AM
Slider ప్రత్యేకం

మూసాపేట్ జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ లో బతుకమ్మ సంబురాలు

#mamata

హైదరాబాద్ లోని మూసాపేట్ జిహెచ్ఎంసి  సర్కిల్ ఆఫీస్ లో జోనల్ కమిషనర్ మమత ఆధ్వర్యంలో నేడు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబు రావు, వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఈ సంబురాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు డివిజన్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బతుకమ్మ పండుగను మహిళలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఓ సుజాత  ఆర్ పి లు కవిత సరిత, రాధాభాయ్, విజయ తదితరులు పాల్గొన్నారు.

కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక హోమం

వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని శరన్నవరాత్రులు సందర్భంగా సుమిత్ర నగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం రామకృష్ణ స్ట్రీట్ పెద్దమ్మ టెంపుల్ లో అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కోవిడ్ నుండి ప్రజలకు విముక్తి అయ్యేలా, జీవన విధానం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా అమ్మ వారి కృప ఉండాలని కోరారు.

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించమని అన్నారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, హరినాథ్, పురేందర్ రెడ్డి, వేణు, అరుణ్, చారి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను భారతీయ ప్రజలు వ్యతిరేకించాలి

Satyam NEWS

టీటీడీ చైర్మన్‌ భూమనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

సాక్షి దినపత్రికలో సగం భాగం నాదే: వై ఎస్ షర్మిలా రెడ్డి

Satyam NEWS

Leave a Comment