హైదరాబాద్ నారాయణగూడలోని జీవీఆర్ కరాటే అకాడమిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కరాటే విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్ని ఉత్సవంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జీ.ఎస్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి తలమమానికంగా బతుకమ్మ ఉత్సవాలు నిలుస్తుందని అన్నారు.
ఇటువంటి సాంస్కృతిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరముందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలకు లేని సాంస్కృతి తెలంగాణ ప్రజల స్వంతమని తెలిపారు. భారతీయ సాంస్కృతి, సంప్రదాయాలను నేడు ప్రపంచం ఆదరించే, ఆచరించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్. నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి, మాధవి, వీణ, సంధ్యారాణి, అంబిక, స్నేహ, అమృత రెడ్డి, యోగిని, జానకి, షైని, ఘణ సంతోషమని, అనగ, ఆభ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట