ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రేపు ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అందువల్ల ఎండలో బయటికి వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడనుందని తెలిపారు.
గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎండలు మళ్లీ పెరగనున్నాయి.