40.2 C
Hyderabad
April 29, 2024 18: 55 PM
Slider విజయనగరం

కోచింగ్ కేంద్రాల్లో మాస్క్ లేని విద్యార్థుల కు “క్లాస్”

VijayanagaramSP

కరోనా సెకండ్ వేవ్ పరంగా కేసులు ఉధృతం అవుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో 300 కేసులు నమోదయ్యాయి. దీంతో పరిస్థితి ని సీరియస్ గా పరిగణించిన ఎస్పీ రాజకుమారీ… కోచింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు.

ఈ మేరకు నగరంలో కరోనా కేసులు పెరుతుండటంతో ఆకస్మికంగా తనిఖీలు చేసారు. ఈ మేరకు కోట జంక్షన్ వద్ల ఓ కోచింగ్ సెంటర్ నుంచీ బయటకు వస్తున్న విద్యార్ధులకు మాస్క్ లు లేకపోవడాన్ని గమనించిన ఎస్పీ…వాళ్లందరికీ అక్కడికక్కడే “క్లాస్ ” తీసుకున్నారు.

అనంతరం  నగరంలో ని కోట జంక్షన్ వద్ద రోటరీ క్లబ్ అధ్వ్యర్యంలో నిర్వహించిన మాస్క్ లు, శానిటైజర్ లు ఉచితంగా పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిధిగా హాజరయి ప్రజలకు, ప్రయాణికులకు మాస్క్ లు, శానిటైజర్ లు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – ముఖ్యంగా మూడు జాగ్రతలతో కరోన వైరస్ ను అరికవచ్చునని, వ్యక్తుల మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ను తప్పనిసరిగా ధరించడం, సానిటైజర్ తో గాని, సబ్బుతో గాని చేతులను తరుచూ శుభ్రపరుచుకోవడం వంటి ముందస్తు జాగ్రతలు పాటించడం ద్వారా కరోన ను అరికట్టవచ్చునన్నారు.

అలాగే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పొంది, కరోన వైరస్ సోకిన వైరస్ పై సమర్ధవంతంగా పనిచేసి, పోరాడుతుందన్నారు, కాబట్టి అవకాశమున్న ప్రతిఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

కరోన వైరస్ వలన ఊపిరితిత్తులమీద పనిచేసి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తప్పకుండ డాక్టర్ ను సంప్రదించి, జాగ్రతలు పాటించాలన్నారు.  కరోనా రెండవ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తున్నందున, ప్రజలందరూ ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, జాగ్రత్తలు పాటించాలన్నారు.

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.

ముఖ్యంగా యువత వలన కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఎక్కువగా యువకులు మాస్కులు ధరించడం లేదని, 18 ఏళ్ళ లోపు ఉన్నవారికి కరోనా వైరస్ సోకినప్పటికీ వారికి ఉన్న ఇమ్యూనిటీ వలన లక్షణాలు బయటపడవని, కాని వారు కరోనా కేరియర్లుగా మారి వారి ఇంటిలో ఉన్న తల్లి, దండ్రులకు ఇతర కుటుంబ సభ్యులను, ఇతరులకు వైరస్ వ్యాపించే వాహకులుగా మారుతారన్నారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ పి.అనిల్ కుమార్, ట్రాఫిక్ డీ.ఎస్పీ ఎల్.మోహన రావు, టూటౌన్ సీ.ఐ సి.హెచ్. శ్రీనివాస రావు, ఎస్.ఐ లు పోలీసు సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు,  ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఇబ్బందులు చెప్పేవారిపై కేసులు పెడితే ఊరుకోం

Satyam NEWS

ఇంటి ఇంటిలో నరేంద్ర మోడీ ఫొటో పెట్టుకునే స్థితి వచ్చింది

Satyam NEWS

విశ్లేషణ: లాక్ డౌన్ తో పెరుగుతున్న మానసిక వత్తిడి

Satyam NEWS

Leave a Comment