నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఇద్దరు విలేకరులు కరోనా తో మృతి చెందారు.
నిర్మల్ జిల్లా బైంసాలో 99 టీవీ రిపోర్టర్ గా పని చేస్తున్న సాయినాథ్ కు కరోనా సోకింది. దాంతో ఆయనను హైదరాబాద్ కు చికిత్స కోసం తరలించారు.
అయితే ఆయన కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని నందిపేట్ మండలం ఆంధ్రభూమిలో 25 ఏళ్లుగా పనిచేసిన జర్నలిస్ట్ అశోక్ కూడా కరోనా బారిన పడ్డారు.
ఆయన కూడా కరోనా చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మృతి చెందాడు.