తూర్పు గోదావరి జిల్లా చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పి.వీర్రాజు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ శుక్రవారం ఎంపికైన వారి జాబితా విడుదల చేసింది. 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా విద్యాశాఖలో చేసిన వీర్రాజు ఏడాది కాలంలోనే స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు.అనంతరం 2021లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడుగా పదోన్నతి వచ్చింది. తర్వాత సాధారణ బదిలీల్లో భాగంగా చాగల్లు విచ్చేశారు.
1996 నుంచి పలు రంగాలలో చేసిన ప్రభుత్వ విధానాలకు ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా. చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు – నేడు పనులు, ఎన్.సి.సితో పాటు పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు తన వంతు కృషి చేశారు.తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ప్రధానో పాధ్యాయడు అవార్డుకు ఎంపిక అవ్వటం చాలా హర్షణీయమని వీర్రాజు తెలిపారు.