చింతలపేట లో భగీరథ పైపు పగిలి చెరువును తలపిస్తుంది. గద్వాల జిల్లా కేంద్రంలోని 32 వ వార్డు చింతలపేట కాలనీలో మిషన్ భగీరథ పైపులైను పగిలి దాదాపు 30 రోజులు గడుస్తున్న పట్టించుకునే నాధుడు లేరని ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ఉన్నది చెరువు కాదని భగీరథ పైపు పగిలి నీరు వృధాగా వెళుతుందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారిలో చలనం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీళ్లన్నీ ఇండ్లలోకి రోడ్లపైకి చేరుకొని ప్రజలు ఇబ్బందిని అధికారులు గుర్తించాలని వారు వేడుకుంటున్నారు.