రాజంపేట జిల్లా నందలూరు లో వైసీపీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నందలూరు ఐకెపిఎస్ నాయకులను కలుపుకొని రైల్వే సమస్యల పైన చలో గుంతకల్ చేపట్టారు.ఈ కార్యక్రమానికి నందలూరు మండలం అరవపల్లె నుంచి వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుని కుమారుడు యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యం వహించారు.బ్రిటీష్ హయం లో ఒక్క వెలుగు వెలిగిన నందలూరు రైల్వే కేంద్రంలో
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరిగా అన్నీ ట్రైన్ లు నిలపాలని,ఉన్న కార్యాలయాలు తరలి పోకుండా చూడాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను గుంతకల్లు లో కలిసి కోరనున్నారు.ఆయన వెంట నాయకులు మస్తాన్,అరిగే హరిబాబు,ఆర్ముగం విశ్వనాధ్,బారతాల శ్రీధర్ యాదవ్,తుంటి రమణయ్య,మహేష్,మండెం నాగరాజు,డేవిడ్ కళ్యాణ్ రాజ్,రాజు,జుల్ఫీ,సుధాకర్ తదితర కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.