విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు కు భారతరత్న ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నారాయణస్వామి డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి బాలప్ప తో కలిసి నేడు ఆయన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి అవుపాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాటసారులకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి తాను చెప్పిన పంటలే వేయాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. తాను చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు పథకం ఇవ్వను అని అనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు.
ఈ డిజిటల్ మహానాడు సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకులు కార్యకర్తలు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, మాల్యాద్రి రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, కశిం, జానీ, డా. రషీద్ రహబర్, మురళి, చెన్నయ్య, కలిమ్, కునాలు NBK ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.