అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లె ఇసుక క్వారీ లో బాదుడే బాదుడే కార్యక్రమంలో భాగంగా బుధవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. క్వారీలో నిరసనకు దిగిన టీడీపీ నేతలకు రూరల్ ఎస్సై భక్త వత్సలం మధ్య వాగ్వాదం జరిగింది.ఈ సందర్భంగా భత్యాల నిబంధనలకు విరుద్ధంగా రాత్రింబవళ్లు ముమ్మరంగా ఇసుక తరలింపు జరుగుతోందని,వంతెన సమీపంలో భారీగా ఇసుక తవ్వకాలతో ఏర్పడ్డ గోతుల మూలంగా వంతెన కు ముప్పు ఉందని ఆరోపించారు.ఇంకా కార్యక్రమంలో టీడీపీ నేతలు అద్దెపల్లి ప్రతాప్ రాజు,సోమల రాజు చంద్ర శేఖర్ రాజు,సంజీవి, డి.ఆర్.యల్.మణి,రామ్ నగర్ నరసింహ,మందా శ్రీను,సుబ్రహ్మణ్యం నాయుడు,తదితరులు పాల్గొన్నారు.