విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం లో కొన్ని కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీ గోడను కూల్చివేశారు.
జె సి బి,ఇతర యంత్రాలు తో అర్ధరాత్రి నుంచి పలు కట్టడాలను కూల్చివేస్తున్నారు. 40 ఎకరాలు భూమి 800 కోట్లు విలువ చేసే భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గీతం యూనివర్సిటీ నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడిది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం అంటున్నది.
ఎందుకు కూల్చివేస్తున్నారో చెప్పలేదని గీతం యాజమాన్యం తెలిపింది. బీచ్ రోడ్ లో గీతం కు వెళ్లే మార్గాన్ని రెండు వైపులా అధికారులు మూసివేశారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.