విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు వద్ద రాత్రి 7గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన దినేష్ ట్రావెల్ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 26 మంది వున్నారు. సంఘటన స్థలంలో 4 దుర్మరణం చెందగా అందులో ఒక చిన్నారి ఉన్నారు.
క్షతగాత్రులను శృంగవరపుకోట సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో విషమ పరిస్థితిలో ఉన్న 10 మందిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు.
రాత్రి సమయం అవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది.