నిజామాబాద్ జిల్లాలోని బిజెపి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ కి చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా పాల్గొన్నారు.
బీజేపీ కార్పొరేటర్లు 8వ డివిజన్ విక్రమ్ గౌడ్,9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) టీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన చూసి తాము ఆకర్షితులమయ్యామని వారు తెలిపారు.