39.2 C
Hyderabad
April 28, 2024 13: 11 PM
Slider ముఖ్యంశాలు

మునుగోడు బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

#bjplogokomatireddy

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఖరారు చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకున్నది. అన్నీ ముందే మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధి ప్రకటన లాంఛనమే అయినా నేడు ఆయనను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ పార్టీలు తమ తమ అభ్యర్ధులను ప్రకటించాయి.

రాజగోపాల్‌ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. ఉపఎన్నికలో వేయాల్సిన ఎత్తులు, ప్రచార ప్రణాళికలు రచిస్తున్న ఆ పార్టీ నేతలు… గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న 3 ఉపఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డిని తమ అభ్యర్థిగా నిర్ణయిస్తూ ప్రకటన వెలువరించారు.  

Related posts

రాష్ట్రంలో జనసేన టీడీపీ అధికారం ఖాయం

Satyam NEWS

మంత్రిని అడిగి తెలుసుకున్న సీఎం

Bhavani

జమ్మూ కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ రాజీనామా

Satyam NEWS

Leave a Comment