తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కారణంగా పేద ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నదని కొమురం భీం జిల్లా భారతీయ జనతా పార్టీ SC సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి తిరుపతి అన్నారు.
బెజ్జుర్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యలో బేజ్జుర్ మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద నేడు ధర్నా నిర్వహించారు. LRS వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్s ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి విడనాడాలని ఆయన కోరారు. TRS ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రజలకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతున్నదని ఆయన అన్నారు.
భూమి లేని దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమిని వెంటనే ఇవ్వాలని తిరుపతి డిమాండ్ చేశారు. పోడుభూములు దున్నుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని, ఇదే విధంగా SC/ST ల భూమిలో పార్కులు కట్టకూడదని వారి భూముల జోలికి పోకూడదని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సొయం చిన్నన్న ( అధ్యక్షులు) బిక్షపతి (ఉపాధ్యక్షులు) మురళీధర్ గౌడ్ (ప్రధాన కార్యదర్శి) జంగం తులసి రామ్ (ఉపాధ్యక్షులు) తలండి మల్లేష్ (గ్రామ కమిటీ అధ్యక్షులు) కామే విలాస్, తదితరులు పాల్గొన్నారు.