తెలంగాణ ఆర్టిఏ ములుగు జిల్లా ఉపాధ్యక్షులుగా బోడ రాజును నియమించినట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గద్ద తిరుపతి తెలిపారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందు ఉంటానని అన్నారు.
సమాచార హక్కు చట్టం పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
తన ఎన్నికకు సహకరించిన వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు బండారి ప్రశాంత్, అధ్యక్షులు శ్రావన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.