రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ శాసన సభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా నేడు బిజెపి నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్ష చేశారు.
ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో యెండల సుధాకర్, నారాయణ యాదవ్, స్వామి యాదవ్, భారత్ భూషణ్, శ్రీనివాస్ శర్మ, సుగుణ, బొబ్బిలి వేణు, సంగమేశ్వర్ రెడ్డి, విజయ, ప్రతాప్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.