అఖిల భారత ప్రజాసేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షులుగా కోటగిరి సతీష్ ను నియమించారు. కామారెడ్డి జిల్లా ఇంచార్జి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు చేతుల మీదుగా నియామక పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా నాయకులు శామ్ రావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వినియోగించే విధంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మఠం విజయ్ కుమార్, వడ్ల నారాయణ, బంగారు రమేష్, గణేష్, కిరణ్, రాజశేఖర్ వివిధ మండలాల సభ్యులు పాల్గొన్నారు.
previous post