ములుగు మేజర్ గ్రామపంచాయతీ లో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు ములుగు RDO కు నేడు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు రాకేష్ యాదవ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి ములుగు గ్రామపంచాయతీలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
దాదాపు మూడు కోట్ల పనిని ఒకే వ్యక్తి కి బినామీ పేర్లతో అప్పగించారని వారు తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అవినీతి అక్రమాలు చేసుకుంటూ నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని వారన్నారు.
ఈ విధంగా నిధులను దుర్వినియోగం చేశారని వారు తెలిపారు. దీనికి అధికారులు కూడా కుమ్మక్కు అయి ప్రజల సొమ్ము దోచుకుతింటున్నారని వారు తెలిపారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను పూర్తిగా పక్కదారి పట్టిస్తూ వాటిని ఎవరికి వారు దోచుకు తింటున్నారని రాకేష్ యాదవ్ ఆరోపించారు.
అందువల్ల వెంటనే గత 2 సంవత్సరాలు కాలంగా చేస్తున్న పనులను విజిలెన్స్ అధికారులు చే విచారణ జరిపించాలని ఆయన కోరారు. మూడు కోట్ల నిధులు పై ఆడిట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.