సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈ నెల 8న,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ షర్మిల సారధ్యంలో ఏర్పాటు కాబోతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విధి విధానాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి,పార్టీలో జాయినింగ్స్,పార్టీ తరపున నిర్వహించాల్సిన కార్యక్రమాల కార్యాచరణ గూర్చి షర్మిలమ్మ తో చర్చించినట్లు ఆదెర్ల శ్రీనివాస రెడ్డి తన ప్రకటనలో తెలిపారు.