నాచారం లో బీజేపీ నాయకురాలు విజయలత రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. బీజేపీ నుండి టికెట్ ఆశించిన విజయలత రెడ్డి కి నిరాశ ఎదురు కావడంతో ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తనకు రావాల్సిన టిక్కెట్ ఇతరులకు కేటాయించారని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు కుటుంబసభ్యులు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తమకు టికెట్ రాకుండా మోసం చేసారని ఆమె మనస్థాపం చెందింది. గత గ్రేటర్ ఎన్నికలలో కూడా బీజేపీ నుండి విజయలత రెడ్డి పోటీ చేశారు.