భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రపై మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు జిల్లా కేంద్రంలో KCR దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు MRPS ములుగు నియోజక వర్గ ఇంచార్జ్ నెమలి నర్సయ్యమాదిగ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ జన్ను రవిమాధిగ, MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుర్రి సతీష్ మాదిగ లు హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం వల్లనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కడియం శ్రీహరి భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచిన కేసీఆర్ ను సమర్థించడం వారన్నారు.
భారత దేశ సమాజానికి కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ముక్కు నేలకు రాయాలని భారత సమాజానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. అదే విధంగా భారత దేశ వ్యాప్తంగా మహాజన దళిత, కుల సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో MRPS జిల్లా సీనియర్ నాయకులు నద్దు నూరి రమేష్ మాదిగ, బోడ రఘు మాదిగ, MSF ములుగు జిల్లా ఆర్గనైజింగ్ కన్వీనర్ పుల్లూరి కర్ణాకర్, MSF ములుగు మండల అధ్యక్షులు, ఇల్లందుల వివేక్ మాదిగ, MRPS సీనియర్ నాయకులు ఓరుగంటి అనిల్ మాదిగ, వసంపల్లి మాదిగ, MSF నాయకులు మంద సింధు మాదిగ, అనిల్ మాదిగ, వేకటేష్ మాదిగ, రమేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.