నిన్న జరిగిన వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు…ప్రతి పక్ష టీడీపీతో పాటు బీజేపీని కోలుకోలేని దెబ్బ తీసాయి. బీజేపీతో జనసేన జతకట్టిన మెరుగైన రిజల్ట్ కనిపించలేదు.జరిగిన ఓటమితో కృంగిపోకుండా..నిరాశ చెందకుండా గట్టి నమ్మకంతో ముందుడగు వేసే పార్టీ ఒక్క బీజేపీ యే.
ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల ఓట్ల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజునే అంటే 16 వ తేదీన రాష్ట్ర బీజేపీ ఓబీసీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర రాజధాని విజయవాడలోని సీతారంపురంలో బీజేపీ అదర్ బ్యాక్ వర్డ్ క్లాస్(ఓబీసీ) సమావేశం జరగనుంది.
ఈ సమావేశానకి పార్టీ పరంగా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డా.కే.లక్ష్మన్ ముఖ్య అతిథిగా రానున్నారు. 2024 లో జరగనున్న ఎన్నికలలో అటు టీడీపీ ,ఇటు జనసేనలతో బీజేపీ కలిసి పోటీచేస్తాయన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ తరుణంలో వచ్చిన పంచాయితీ,మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న పట్టు ఏంటో…క్షేత్ర స్తాయిలో పార్టీ పరిశీలన కూడా చేసింది.పనిలో పనిగా..ఓబీసీ వర్గాలను కూడా ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్లతో సమావేశం నిర్వహించడానికి బీజేపీ సమాయాత్తం మవుతోందనే చెప్పాలి.