40.2 C
Hyderabad
April 26, 2024 13: 44 PM
Slider పశ్చిమగోదావరి

కడుపు మండిన కాంట్రాక్టర్ ఏం చేశాడో తెలుసా?

#Contractor

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరుకు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో నూతనంగా ఆధునిక హంగులతో ఒక కాంట్రాక్టర్ సచి వాలయాన్ని నిర్మించాడు.

ఆ సచివాలయం నిర్మించడానికి కాంట్రాక్టర్ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సచివాలయం ప్రారంభోత్సవం కూడా జరిగింది.

సచివాలయ నిర్మాణానికి సంబంధించి పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఒకరు సదరు కాంట్రాక్టర్ తనకు  పర్సెంటేజ్ ఇవ్వడం లేదని బిల్లు పెట్టకుండా కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

దీనిపై కాంట్రాక్టర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ముడుపులు చెల్లించనిదే బిల్లులు పెట్టని అధికారులపై కోపం తో సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న  సచివాలయ సిబ్బందిని బయటకు పంపి కాంట్రాక్టర్ సచివాలయానికి తాళాలు వేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకోవడం విశేషం.

Related posts

ఉప్పల్ కు వరం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో నిలిచిపోయిన డిక్లరేషన్

Satyam NEWS

MLA క్వార్టర్స్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

Bhavani

Leave a Comment