36 C
Hyderabad
May 13, 2025 11: 52 AM
Slider జాతీయం తెలంగాణ

ఉత్సాహం పై నీళ్లు చల్లిన అమిత్ షా

amith sha

ఎప్పుడెప్పుడు దూకుదామా అని ఉత్సాహం పై ఉన్న తెలంగాణ బిజెపి ఆశలపై బిజపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నీళ్లు చల్లారు. తెలంగాణ‌లో సెప్టెంబ‌ర్ 17 విమోచ‌న దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తెలంగాణ బిజెపి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. దీన్నొక పండుగ కార్య‌క్ర‌మంగా చేయాల‌నే ఉద్దేశంతో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో భారీ బ‌హిరంగ స‌భ‌కు కూడా ప్లాన్ చేశారు. ఈ స‌భ‌కు ముఖ్య‌మంత్రి అతిథిగా కేంద్ర హోం మంత్రి, బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌స్తార‌ని కూడా తెలంగాణ బిజెపి నేత‌లు చెప్పారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. బిజెపి అధికార ప్ర‌తినిధి ప్రేమేంద‌ర్ రెడ్డి ఇదే విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ప‌టాన్ చెరులో పార్టీ త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా హాజ‌రు కావ‌డం లేద‌ని చెప్పారు. ఆరోజున ఢిల్లీలో కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలున్నాయ‌నీ, అందుకే ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ఆయ‌న స్థానంలో మ‌రో కేంద్ర‌మంత్రిని ముఖ్య అతిథిగా పంపిస్తార‌ని అన్నారు. నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ప్ర‌తీ ఒక్క‌ర్నీ స్మ‌రించుకోవాల‌నీ, విమోచ‌న దినోత్స‌వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సెప్టెంబ‌ర్ 17న ఊరు నిండా జెండాలు అనే కార్య‌క్ర‌మాన్ని పార్టీ చేప‌డుతోందని చెప్పారు.

Related posts

జగన్ రెడ్డీ… ఇక కళ్లు తెరిచే అవకాశం రాదులే

Satyam NEWS

శేరిలింగంపల్లి లో బాక్స్ డ్రైన్ నిర్మాణానికి ఆదేశాలు

Satyam NEWS

ఎన్నికల కమిషనర్ విధినిర్వహణకు కిరికిరి పెట్టవద్దు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!