గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి బాగ్ అంబర్పేట్ డివిజన్లో డివిజన్ బిజెపి అధ్యక్షుడు చుక్క జగన్ నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్ర అయ్యప్ప గుడి దగ్గర నుండి శ్రీనివాస నగర్, గంగ బౌళి, శాంతినగర్, బతుకమ్మ కుంట, పోచమ్మ బస్తి, పాముల బస్తి లలో సాగింది.
ఈ పాదయాత్రలో బతుకమ్మ కుంట గ్యాస్ సమస్య, సాయి మధుర నగర్ లో కలుషిత మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, పాడైపోయిన రోడ్ల సమస్యలను ప్రజలు తెలియజేశారు.
ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నేతలు తెలిపారు.
ఈ పాదయాత్రలో చుక్క జగన్, C. కృష్ణ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సాంబ శివ గౌడ్, అచ్చిని రమేష్, జి మల్లేష్, కె.చంద్రశేఖర్, జమ్మి చెట్టు బాల్రాజ్, P. కృష్ణ గౌడ్ D.వెంకటేష్, ఈ. భాస్కర్, ఈ. బాలకృష్ణ, G. శ్రీనివాస్, P. సునంద, రవీందర్ మంజరి, రాధాకృష్ణ (రఘు), బాలకృష్ణ గౌడ్, సాయి ఠాకూర్, శేఖర్, యాదగిరి పాల్గొన్నారు.