భారత రాష్ట్రపతి ఎన్ డి ఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రకటించడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని బిజెపి రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మజ హర్షం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తితో ఆమె జీవిత ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా భాజపాలో నగర కౌన్సిలర్ స్థాయి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి..రెండుసార్లు ఒడిషా మంత్రిగా పనిచేశారన్నారు.
జార్ఖండ్ గవర్నర్గా పని చేసిన తొలి మహిళ. ఆమె చేసిన నిస్వార్థమైన సేవకు ప్రతిభకు గుర్తంపుగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆమె విశేషసేవలు అందించారన్నారు. బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇచ్చి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చెయ్యడం నిజమైన మహిళా సాధికారతకు నిర్వచనం అని , ఒక్క బిజెపిలోనే ఇటువంటివి సాధ్యం అని రాష్ట్ర బీజేపీ మహళా ఉపఅధ్యక్షరాలు శ్రీమతి తుమ్మల పద్మజా లక్ష్మి పేర్కొన్నారు.
సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ బీజేపీ ద్వారా సాధ్యం అని నిరూపిస్తే ,ప్రతిపక్షాలు బడుగు బలహీనవర్గాలను ఓట్ బ్యాంకులుగా మాత్రమే చూసి పదవులు ఇచ్చే సమయానికి వారికి వెన్నుపోటు పొడవం పరిపాటిగా మరిందన్నారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఏమిటో ప్రతి ఒక్కరు గుర్తించాల హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశంలోనే విజయ పతాకం ఎగర వేస్తుందని స్పష్టం చేశారు.