అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్ళానన్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి నిలిచిపోయిన ఉడుగుల వాగు కనిపించడం లేదా అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు ప్రశ్నించారు. ఇవాళ ఆయన మొలచింతలపల్లి, నార్లాపూర్, ముక్కిడిగుండం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఆగిపోయిన ఉడుగులవాగు వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు.
నాయకులను పార్టీలు మార్పించడంపై ఉన్న శ్రద్ద అభివృద్ధి పనులపై లేదని ఫైర్ అయ్యారు సుధాకర్ రావు. ఉడుగుల వాగు వంతెన యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్ మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్ ముక్కిడిగుండం BJP వార్డు మెంబర్స్ గంట శ్రీనివాస్ యాదవ్, ఓరే హైమవతి శేఖర్ మాదాసి కుర్వ, నాయకులు పాత్లవత్ శ్రీరాములు నాయక్, గంగం మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.