30.7 C
Hyderabad
April 29, 2024 06: 50 AM
Slider మహబూబ్ నగర్

పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఉడుగుల వాగు బ్రిడ్జి

#BJP Kollapur 2

అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్ళానన్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి నిలిచిపోయిన ఉడుగుల వాగు కనిపించడం లేదా అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు ప్రశ్నించారు. ఇవాళ ఆయన మొలచింతలపల్లి, నార్లాపూర్, ముక్కిడిగుండం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఆగిపోయిన ఉడుగులవాగు వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు.

నాయకులను పార్టీలు మార్పించడంపై ఉన్న శ్రద్ద అభివృద్ధి పనులపై లేదని ఫైర్ అయ్యారు సుధాకర్ రావు. ఉడుగుల వాగు వంతెన యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్ మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్ ముక్కిడిగుండం BJP వార్డు మెంబర్స్ గంట శ్రీనివాస్ యాదవ్, ఓరే హైమవతి శేఖర్ మాదాసి కుర్వ, నాయకులు పాత్లవత్ శ్రీరాములు నాయక్, గంగం మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికారం శాశ్వతం కాదని జగన్ గుర్తుంచుకోవడం మంచిది

Satyam NEWS

కొత్తవలసకు వస్తున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్

Satyam NEWS

మన మధ్యే తిరుగుతున్న స్లీపర్ సెల్స్

Satyam NEWS

Leave a Comment